ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరికి తానా జీవత సాఫల్య పురస్కారం..

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మొఘల్ ను శాసిస్తున్న శక్తి నరేంద్ర చౌదరి. రచన గ్రూప్ సంస్థలతో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు ఆయన. మీడియా రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన ఈయనకు ఇప్పుడు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తానా సంఘం నుంచి ఈయనకు జీవన సాఫల్య పురస్కారం వచ్చింది. వాషింగ్టన్ డీసీలో జులై 4 నుంచి 6 వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ మహాసభలో తానా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఈ సారి కూడా ప్రకటించారు. అందులో ఎన్టీవీ ఛైర్మన్ కూడా ఉన్నారు. ఈ సారి జీవనసాఫల్య పురస్కారం తుమ్మల నరేంద్ర చౌదరికి ఇవ్వనున్నట్టు తానా అధ్యక్షుడు సతీష్ వేమన చెప్పారు. ఇక ఈయనతో పాటు ఎన్టీఆర్ కల్చరల్ అవార్డ్ను ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ.. తానా గుత్తికొండ రవీంధ్రనాథ్ సర్వీస్ అవార్డ్ను డా. గంగా చౌదరి.. తానా గిడుగు రామ్మూర్మి అవార్డును డా. గారపాటి ఉమమహేశ్వర్రావుకు అందజేయనున్నారు.
తానా ప్రెసిడెంట్ అవార్డులను భారత్ బయోటెక్ సీఈవో కృష్ణ ఎల్లా, గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ రవీంద్రనాథ్ కంచర్లకు, కాకినాడ సీపోర్ట్స్ చైర్మన్ కేవీ రావు, మహిళాసాధికారత కోసం విశేష కృషి చేసిన బత్తుల విజయభారతికు ఇవ్వనున్నారు. ఇక, తానా ఎక్స్లెన్సీ అవార్డ్స్ను 12 మందికి ప్రకటించారు. తానా మెరిటోరియస్ అవార్డులను కూడా ప్రకటించారు. శశికాంత్ వల్లిపల్లి, జయంత్ రెడ్డి చల్లా, ప్రసాద్ పాండా, మృణాళిని సదానంద, స్వాతి గుండపునీడి, అడపా ప్రసాద్, ప్రసాద్ కునిశెట్టి, రజనీకాంత్ గంగవరపు, నిత్య మలిశెట్టి, వసుంధర కలశపూడి, అనురాధ నెహ్రు, రావు రాపాక, ప్రకాశం తాతా, హనుమయ్య బండ్ల, ధర్మప్రచారక్ రామినేని, స్నేహ తాళిక, లక్ష్మి లింగ, కృష్ణమోహన్ రావు జెజ్జల, ససల చల్ల, కావ్య కొప్పరపు, సందీప్ వోలేటి, నైషా బెల్లం, కుమార్ నందిగం, నాగరాజు నలజుల తదితరులకు జులై 4న తేదీన జరిగే బాంక్వెట్ లో అందచేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tana2019.org ని వీక్షించండి.