ప్రభాస్ రిలీజ్ చేసిన మోడీ బయోపిక్ పోస్టర్

ప్రస్తుతం బయోపిక్స్ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మన ప్రధాని నరేంద్రమోడీ జీవితకథ ఒక బయోపిక్ రాగా ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా మరో బయోపిక్ రాబోతోంది. మోదీ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తోన్న సినిమా 'మన్ బైరాగి'. ఈరోజు మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడులైంది. హిందీలో 'మన్ బైరాగి' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో 'మనోవిరాగి' పేరిట విడుదల చేస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ ను తెలుగులో ప్రభాస్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో మనోవిరాగి పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా పోస్టర్స్ ను రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫస్ట్లుక్ పోస్టర్లను తన అభిమానులు, తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు.
'ఈ ప్రత్యేకమైన రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద మరో ప్రత్యేకమైన ఫిల్మ్ మేకర్ ఒక ప్రత్యేకమైన సినిమాను ప్రకటించారు. నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంజయ్ లీలా భన్సాలీ, మహవీర్ జైన్ల 'మన్ బైరాగి' సినిమా ఫస్ట్లుక్ను నేను లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ప్రధాన మంత్రి మోదీ గురించి ప్రజలకు తెలియని కథ ఇది. సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తారు' అని ఆ పోస్టర్స్ ను పోస్ట్ చేసి రాసుకొచ్చాడు ప్రభాస్. అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రస్తుహం బీజేపీలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కోరిక మేరకే ప్రభాస్ ఈ పోస్టర్ రిలీజ్ చేశాడని చెప్పుకుంటున్నారు.