రామ్ కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ అయినట్టే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరోసారి ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆడిపాడబోతున్నాడు. ఈ యంగ్ హీరో కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఓ టాలెంటెడ్ హీరోయిన్ తో పాటు మాస్ మహా రాజా సరసన నటిస్తున్న హీరోయిన్ తో రామ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ కథానాయకుడుగా ఓ సినిమా తెరకెక్కుతుంది. తమిళంలో విజయం అందుకున్న ‘తడం’ చిత్రానికి తెలుగు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మితమవుతోంది. కిషోర్, రామ్ కలయికలో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్గా రాబోతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు గట్టిగా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మలను ఫైనల్ చేశారని చెబుతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబరు నుంచి ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమా టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు.