పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్.. ఆ రీమేక్లో పవర్ స్టార్..

అనుకున్నాంతా అయింది.. పవన్ మళ్లీ సినిమాలు చేయబోతున్నాడు. ఈయన సినిమాలు చేయాలని మరింత ఒత్తిడి పెరిగిపోతుంది.రాజకీయాల కోసం విపరీతంగా గడ్డం పెంచిన పవన్.. ఇప్పుడు మళ్లీ హీరోలా మారిపోయాడు. ఆ మధ్య కొత్త లుక్ లో తానా మహాసభలలో కనిపించాడు. అప్పట్నుంచి ఈయన మళ్లీ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నిర్మాతలు అయితే ఈయన కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు పవన్ స్నేహితుడు రామ్ తాళ్ళూరి, ఏ.ఎమ్. రత్నం లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు పవన్ అనుమతి కోసం చూస్తున్నారు. 2024 ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉందని.. ఆ లోపు కనీసం రెండు సినిమాలు అయినా చేయాలంటూ కోరుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కూడా ఈ విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏఎం రత్నం కాకుండా ఇప్పుడు దిల్ రాజు సీన్ లోకి వచ్చాడు. ఆయన బోనీ కపూర్ తో కలిసి పవన్ సినిమా నిర్మించబోతున్నాడు. చాలా రోజులుగా పవన్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్న రాజు.. ఇప్పుడు దాన్ని సొంతం చేసుకున్నాడు. మూడేళ్ల పాటు ఏడాదికో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా పవన్ ముందుకు వచ్చిందని.. దాని వైపు ఆయన ఆలోచిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈయన సినిమా మొదలు కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు పవర్ స్టార్. దీనికోసం కథ కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికే వేణుకు దీనికోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. హిందీలో అమితాబ్.. తమిళ్ లో అజిత్ నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు.