కొత్త వ్యాపారం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి

టాలీవుడ్ లో రచ్చ రేపి ప్రస్తుతం చెన్నైలో ఉంటోన్న నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. ముఖ్యంగా ఫేస్బుక్ లో ఆమె ఇప్పుడు రచ్చ రేపుతోంది. అంతే కాక యూట్యూబ్లో శ్రీరెడ్డి పేరుమీద ఒక ఛానెల్ను నడిపిస్తోంది. పలు ఘటనలపై తన అభిప్రాయాలను తెలిపే వీడియోలను అందులో పోస్ట్ చేస్తోంది శ్రీరెడ్డి. ఇక అయితే, శ్రీరెడ్డి ఇప్పుడు మరో యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభిస్తోందట.
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త యూట్యూబ్ ఛానెల్ను ప్రకటించింది ఈమె. నిధి ఎంటర్టైన్మెంట్స్ పేరిట మొదలు కానున్న ఈ యూట్యూబ్ ఛానెల్ తమిళంలో ఉంటుందట. ఈ యూట్యూబ్ ఛానెల్ లో పనిచేయడానికి సిబ్బంది కావాలంటూ శ్రీరెడ్డి ప్రకటన కూడా విడుదల చేసింది శ్రీ రెడ్డి. ఈ ప్రకటనను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
ఈ ఛానెల్లో పనిచేయడానికి యాక్టర్స్, యాంకర్స్ కావాలని ప్రకటనలో పేర్కొంది. యాక్టర్స్, యాంకర్స్ కోసం స్త్రీ, పురుషులిద్దరూ అప్లై చేయొచ్చు. వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలట. అలాగే.. కెమెరామేన్, ఎడిటర్, కంటెంట్ రైటర్ కూడా కావాలని ఇదే ప్రకటనలో శ్రీరెడ్డి పేర్కొంది. ఇంటర్నషిప్ ఇవ్వడం ద్వారా యువతకు కూడా అవకాశాలు కల్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ప్రొఫైల్స్ను ఈమెయిల్ చేయాలని మెయిల్ ఐడీ కూడా ఇచ్చింది.
మొత్తానికి హైదరాబాద్ నుంచి చెన్నైకు మకాం మార్చిన శ్రీరెడ్డి ఈ కొత్త బిజినెస్ మొదలు పెట్టిందన్న మాట.