చిరంజీవిని వదిలే సమస్యే లేదంటున్న పూరీ జగన్నాథ్..

నిజంగా ఇప్పుడు ఇదే జరుగుతుంది. చిరంజీవి వరస సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత దర్శకుల్లో కూడా ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తుంది. పైగా పూరీ కూడా ఒకటి రెండు కాదు పదేళ్లుగా ఈయన డేట్స్ కోసం చూస్తున్నాడు. అప్పుడు కూడా అనుకోకుండా మిస్ అయిపోయింది. చిరంజీవి సినిమాలు మానేసిన తర్వాత ఈ తరం దర్శకులకు అతడితో సినిమా చేసే అవకాశం ఇక రాదేమో అని అంతా నిరాశపడ్డారు. కానీ మెగాస్టార్ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు అంతా పండగ మూడ్ లో ఉన్నారు. ఆయన కోసం కథలు సిద్ధం చేసి మెప్పించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే చాలా ఏళ్ల నుంచి పూరీ జగన్నాథ్ ఇలాంటి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈయన 150వ సినిమాను పూరీనే తెరకెక్కించాల్సి ఉంది. దీనికి ఆటోజానీ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు పూరీ. అంతా ఓకే అనుకున్న తరుణంలో సినిమా ఆగిపోయింది.
అయితే చిరంజీవితో సినిమా ఆగిపోవడం ఇదే తొలిసారి కాదు.. మూడో సారి అంటున్నాడు పూరీ. ఆటోజానీకి ముందు కూడా మూడుసార్లు కథ చెప్పినా ఫలితం లేకుండా పోయిందంటున్నాడు ఈయన. నా బ్యాడ్ లక్ ప్రతీసారి అన్నయ్యకు నచ్చే కథ చెప్పలేకపోతున్నాను అంటున్నాడు పూరీ జగన్నాథ్. అందులో రెండుసార్లు దురదృష్టవశాత్తు రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయిన తర్వాత ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం చిరు ఓకే అంటే కేవలం ఐదంటే ఐదే రోజుల్లో కథ సిద్ధం చేసి ఆయనకు వినిపిస్తానంటున్నాడు పూరీ జగన్నాథ్.
ఇస్మార్ట్ శంకర్ విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈయన ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు పూరీ. ఆ తర్వాత చిరు కోసం కథ సిద్ధం చేస్తానంటున్నాడు. మరోవైపు పవన్ కూడా లైన్ లోనే ఉన్నాడు. ఈసారి మాత్రం చిరంజీవితో పని చేసే ఛాన్స్ వస్తే వదులుకునే సమస్యే లేదంటున్నాడు ఈయన. దానికి తగ్గట్లే తన కోసం కథ సిద్ధం చేసుకోవాల్సిందిగా పూరీని చిరు కోరినట్లు తెలుస్తుంది. మరి చూడాలి.. చిరు ఈయనను నమ్మి సినిమా ఇస్తాడో లేదో..?