కరోనా వేళ ఖతర్నాక్ బిజినెస్ చేస్తున్న లావణ్య త్రిపాఠి..

కరోనా కాలంలో 'ఇంట్లో తయారు చేసిన మాస్క్లు' ధరించడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. హైదరాబాద్ డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో మార్చి నుంచి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ మాస్క్లు తయారు చేయిస్తుంది. ఈ ఇద్దరూ కలిసి 'రెడ్ట్రీ' బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మాస్క్లను తీసుకొస్తున్నారు. దీన్ని బిజినెస్లా లాభనష్టాలు చూసుకోకుండా వీలైనంత ఎక్కువ మందికి మాస్క్లు అందజేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకొనే ఆరోగ్య జాగ్రత్తలకు తమవంతు సహాయం అందిస్తుంది లావణ్య త్రిపాఠి. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. లాక్డౌన్లో వెసులుబాటు దొరికిందని.. నిబంధనలు సడలించారని మాస్క్లు ధరించడం మానొద్దని చెప్తుంది. కరోనాతో చేస్తున్న ఈ పోరాటం మీకు బోర్ కొట్టినా కూడా జాగ్రత్తలు మాత్రం మరిచిపోవద్దని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. మీకు ఎంత విసుగు వచ్చినా కూడా కరోనాకు మాత్రం బోర్ కొట్టదని కామెడీగా చెప్పేసింది లావణ్య. అందుకే మాస్కులు తప్పనిసరి అంటుంది ఈమె. 'గో లోకల్, బీ వోకల్' అని ప్రజలు నినదిస్తున్న ప్రస్తుత తరుణంలో లోకల్ టాలెంట్కి అవకాశం ఇస్తూ లావణ్య త్రిపాఠి తయారు చేయిస్తున్న ఈ మాస్క్లకు డిమాండ్ కూడా బాగానే ఉంది.
టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలామంది 'రెడ్ట్రీ' మాస్క్లు ధరిస్తున్నారు. 'రెడ్ట్రీ' మాస్క్ల తయారీ ఎలా ప్రారంభమైందో లావణ్య త్రిపాఠి చెప్తూ.. కరోనా కారణంగా మా టైలర్స్, మాస్టర్స్కి తాము పెయిడ్ లీవ్స్ (వేతనంతో కూడిన సెలవులు) ఇచ్చాం. లాక్డౌన్ వల్ల ఇంట్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందని వాళ్లు చెప్పారు. వాళ్లకు సాయంగా ఉండటానికి ఇది మొదలుపెట్టామని చెప్పింది. వాళ్లకు కూడా ఏ పని లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నామని చెప్పారు. వాళ్లకు సహాయ పడేలా ఏదైనా చేయాలని మాస్క్ల తయారీ ప్రారంభించామని చెప్పింది లావణ్య. అటు మాస్క్లు కొనుక్కునే వాళ్లకు, ఇటు టైలర్స్కి సహాయపడాలన్నది తమ ఉద్దేశమని చెప్పింది ఈమె. తమది నాన్ ప్రాఫిట్ వెంచర్ అని చెప్పుకొచ్చింది లావణ్య. ప్రస్తుతం 'రెడ్ట్రీ' బ్రాండ్ పేరు మీద మాస్క్లు మాత్రమే తయారు చేస్తున్నప్పటికీ... భవిష్యత్తులో బ్రాండ్ పేరు మీద మరిన్ని ఉత్పత్తులు తీసుకురావాలనే ప్రణాళికల్లో లావణ్య త్రిపాఠి, అనితా రెడ్డి ఉన్నారు.