పవన్ క్రిష్ సినిమా మీద ఆ రూమర్ నిజం కాదట

పవర్ స్టార్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఓ మూవీ తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా తెరక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి లాక్ డౌన్ కి ముందే దర్శకుడు క్రిష్ కొంత మేర షూటింగ్ జరిపారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని ప్రచారం జరుగుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించి ముందు నుండీ విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
తాజగా ఈ సినిమా టైటిల్ అంటూ మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్న ఈ సినిమాకి వీర అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని టీం భావిస్తుందని అంటున్నారు. పవన్ కూడా ఈ టైటిల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ముందు నుండి ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథానాయికగా కనిపించనుందని అంటున్నా ఇప్పుడు కొత్తగా మరో హీరోయిన్ పేరు తెర మీదకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరగగా అందులో నిజం లేదని తెలుస్తోంది.