మరో రచ్చకు రెడీ అయిన వర్మ, ఈ సారి నేషనల్ టార్గెట్

వర్మ రచ్చ రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్డౌన్లో కూడా బూతు సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకున్న వర్మ ఆ తరువాత పవన్ మీద పడ్డాడు. ఇప్పటికే క్లైమాక్స్, నేక్డ్ అంటూ పోర్న్ సినిమాలకు తక్కువ కానీ కంటెంట్ ఆన్లైన్లో విడుదల చేసి సొమ్ము చేసుకున్న వర్మ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు 100 రూపాయలు టికెట్ పెట్టాడు.. ఆ తర్వాత ‘నేక్డ్’ అనే మరో లోకల్ బూతు సినిమాకు 200 రూపాయలు టికెట్ పెట్టాడు. పవన్ సినిమాకి 250 టికెట్ పెట్టి గట్టిగానే వెనకేసుకున్న వర్మ త్వరలో ప్రముఖ నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయిన ఆర్నబ్ గోస్వామి మేఅ సినిమా చేయనున్నాడట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. ఈ సినిమాకు ‘అర్నాబ్ - ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అని టైటిల్ కన్ఫాం చేసినట్టు అనౌన్స్ చేశారు.
దీనికి కారణం లేకపోలేదు, అర్నాబ్ ఈ మధ్య సుశాంత్ మరణం విషయంలో పలు డిబేట్స్ పెట్టి బాలీవుడ్ ని కార్నర్ చేస్తున్నాడు, బాలీవుడ్ ని డర్టీ అని చెబుతూ అండర్ వరల్డ్తో బాలీవుడ్కి సంబంధాలు ఉన్నాయని దివ్య భారతి మొదలుకొని జియా ఖాన్, శ్రీదేవి, ఇప్పుడు సుశాంత్ మరణం వరకు అన్ని మిస్టరీలకి బాలీవుడ్ సమాధానం చెప్పాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నాడు. అందుకే వర్మ వరుస ట్వీట్లు చేసి ఆయన్ను టార్గెట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. బాలీవుడ్ గురించి అర్నాబ్ తప్పుగా మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్న వర్మ ఇది డర్టీ ఇండస్ట్రీ అని, దీనికి క్రిమినల్ కనెక్షన్స్ ఉన్నాయని, రేపిస్టులు, గ్యాంగస్టర్స్, కామ పిశాచాలతో ఈ ఇండస్ట్రీ నిండిపోయిందని అర్నాబ్ చేబుదున్నాడని అన్నారు.
దివ్య భారతి, జియా ఖాన్, శ్రీదేవి, సుశాంత్ మరణాలు ఒకే రకమైనవని అర్నాబ్ గోస్వామి గుడ్డిగా వాదించడం షాక్కి గురి చేసిందని, ఈ నాలుగు కేసులు పూర్తిగా విరుద్ధమైనవని వేర్వేరు సందర్భాల్లో జరిగినవని కానీ, అర్నాబ్ మనసు మాత్రం ఈ నాలుగు ఒకటేనని చెబుతోందని అన్నారు. ఇందరి మృతికి బాలీవుడ్ కారణం అంటూ అర్నాబ్ చేస్తున్న వ్యాఖ్యలని చూస్తుంటూ బాలీవుడ్ ఏమైన విలే పార్లే శ్మశానంలో నిద్రపోతున్న దెయ్యమా అని అనుమానం వస్తుందని అన్నాడు. ర్నాబ్ ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, మహేష్ భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా ఇతర బాలీవుడ్ స్టార్లు ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని వీరందరు ఆఫీసుల్లో బల్లల కింద దాక్కున్నారా? మౌనంగానే ఉంటే ఖచ్చితంగా తప్పు చేసిన వారే అవుతారు. ఇప్పటికైన స్పందించి క్లారిటీ ఇవ్వాలని అన్నారు.