ఫ్రెండ్ సినిమా ఆగిపోయిందని తెలుసుకుని ఆఫర్ ఇచ్చిన ప్రభాస్

హీరో గోపీచంద్ గత కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. రీసెంట్ గా చాణక్య సినిమాతో మళ్ళీ లైన్ లోకి వస్తాడు అనుకుంటే అది కూడా దెబ్బేసింది. దమ్ములేని కథ, లాజిల్ లేని టేకింగ్ కావడంతో ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. చాణక్య రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి, ఈసారి గోపీచంద్ హిట్ కొట్టడం ఖాయమని సినీ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ అది మళ్ళీ దేబ్బెసింది. ఇక ఇది ఎలాగూ హిట్ కొడతారు కాబట్టి గోపీచంద్ తో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఆ రెండు సినిమాలలో ఒకటి పూర్తి కావొచ్చింది.
అది సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్. ఇది కాక అదే సినిమాతో ప్రారంభం అయిన మరో సినిమా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ బ్యానర్ లో చేయాల్సి ఉంది. అయితే సంపత్ నంది సినిమా పూర్తి కావోచ్చినా ప్రసాద్ బ్యానర్ లో మొదలైన సినిమా మాత్రం ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎందుకంటే చాణక్య బెంచ్ మార్క్ కూడా అందుకోని కారణంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకునున్నారని అంటున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్.. తన స్నేహితుడు గోపీచంద్ కెరీర్ నిలబెట్టడానికి ఇద్దరు ముగ్గురు బడా దర్శకులతో కథలను రెడీ చేయిస్తున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అన్నట్టుగానే సాహో దర్శకుడు సుజిత్ తో గోపీచంద్ కోసం ఒక యాక్షన్ మూవీని ప్రభాస్ సెట్ చేయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాని కూడా ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని అంటున్నారు. ప్రభాస్-గోపీచంద్ లు వర్షంలో కలిసి నటిచిన నాటి నుండి మంచి ఫ్రెండ్స్. ఆ రకంగా ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు ప్రభాస్ అండగా నిలబడుతున్నాడన్న మాట.