ప్రభాస్ సరసన నివేధా...నిజమేనా

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే అతిశయోక్తి కాదేమో. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ బాహుబలి సిరీస్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం అది నిలవకేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్నది.
ఈ ఏడాది చివరలో సినిమాను సెట్స్పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నా రాధే శ్యామ్ పూర్తి కావడం మీదే ఇది ఆధార పడి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొన్ కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా వైజయంతీ మూవీస్ ప్రకటించింది కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండనుందని అందుకే ఆమె కోసం ఇప్పటికే వేట ప్రారంభించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కోసం నివేద థామస్ ని తీసుకోవాలని చూస్తున్నారట. మొన్న పవన్ ఇప్పుడు ప్రభాస్ లతో నటించనుండడంతో ఆమె క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. అయితే అసలు ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.