నేను రావ్ రమేష్ కు పెద్ద అభిమానిని..కేటీఆర్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన సినిమా శ్రీకారం. ఈ సినిమాకు కొత్త దర్శకుడు బి కిషోర్ దర్వకత్వం వహించారు. సినిమాలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు రమ్మని ఆహ్వానించినందుకు ధన్యవాదాలన్నారు. చాలా సందర్భాల్లో చాలా రకాలు ఈవెంట్లకు వెళ్తుంటాం. కానీ కొన్నింటికి వెళ్లినప్పుడే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అలా ఇప్పుడు అనిపిస్తోంది. శ్రీకారం టీజర్ చూశాను. ఆ తరువాత 9 నిమిషాల వీడియో చూశాను. హృదయంతో ఈ సినిమాను నిర్మించారు. కిషోర్ ఎంత సింపుల్గా కనిపిస్తున్నాడో.. శర్వానంద్ కూడా అంతే సింపుల్గా ఉన్నారు.
''అన్నం ఉడికిందో లేదో అని ఓ మెతుకు పట్టుకుని చెప్పినట్టు.. టీజర్ చూస్తేనే సినిమా బాగా తీశారని చెప్పవచ్చు. రావు రమేష్ గారికి నేను అభిమానిని. ఆయన తండ్రి రావు గోపాల్ రావు గారంటే ఎంతో అభిమానం. రావు రమేష్, శర్వా మొదటి చిత్రం గమ్యం.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత చేసిన చిత్రం శ్రీకారం.. ఇదో విడ్డూరం. శర్వానంద్ ఎన్నో రకాల చిత్రాలను చేస్తుంటారు. డిఫరెంట్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. మంచి ప్రయత్నాలు, మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అండగా ఉంటాం. హరీష్ చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తాను. మంచి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరించాలి. పైరసి లేకుండా థియేటర్లోనే సినిమాను చూడండి`` అన్నారు.