మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీమ్ అని అభినందించిన కింగ్ నాగార్జున

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాతలు బన్ని వాసు, వాసువర్మ లు సంయుక్తంగా జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 15న విజయదశమి సందర్బంగా విడుదలయ్యి పండగ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి గోపిసుందర్ అందించిన ఆడియో సూపర్బ్ సక్సస్ అవ్వటంతో ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుని దియేటర్స్ కి ప్రేక్షకుల్ని రప్పిస్తుంది.
ఇప్పటికే 40 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి అఖిల్ అక్కినేని కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిలవటం విశేషం. అయితే.. ఈ చిత్ర ఘన విజయం సందర్బంగా కింగ్ అక్కినేని నాగార్జున మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ టీంని అభినందిస్తూ.. ఆయనే హోస్ట్ గా సెలబ్రెట్ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, రాహుల్ రవీంద్రన్, సుబ్బు, వెంకీ అట్లూరి,డాలి, ప్రతాప్, కౌషిక్ హజరయ్యారు. ఈ సినిమా ఇంకా మంచి విజయాన్ని సాధించాలని అందరూ వారి బ్లెస్సింగ్స్ అందించారు.