కార్తికేయ 2...మళ్ళీ హీరోయిన్ ని మార్చారా

2014 లో నిఖిల్, కలర్స్ స్వాతి లీడ్స్ గా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' మంచి హిట్ గా నిలిచింది. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ హిట్ సినిమాకి సీక్వెల్గా ‘కార్తికేయ-2’ సినిమాని ప్లాన్ చేశారు. నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ-2' పేరుతో రూపొందనున్నట్టు గత ఏడాది మేలోనే ప్రకటించారు.
ఈ సినిమా షూటింగ్ జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ అంటూ పలువురి పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో భామ పేరుకూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్’ భామ నభా నటేష్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.
దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి కథానాయికల్లో నిఖిల్ సరసన ఎవరు నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే దాకా ఆగాల్సిందే. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.