ఏప్రిల్ 2న అనుష్క నిశ్శబ్దం సినిమా విడుదల..

భాగమతి సినిమా తర్వాత పూర్తిగా కనిపించడం మానేసింది అనుష్క శెట్టి. మునుపటిలా అవకాశాలు కూడా రావడం లేదు. రెండేళ్లుగా నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ మధ్య విడుదలైన చిరంజీవి సైరా సినిమాలో చిన్న పాత్ర చేసింది ఈ భామ. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో నటిస్తోంది అనుష్క. ఈ చిత్రం షూటింగ్ కూడా ఈమధ్యే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది ఈ సినిమా. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ మేరకు అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
అరుంధతి, రుద్రమదేవి, భాగమతి ఇలాంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది అనుష్క. ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ నిశ్శబ్దం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రాస్ జోనర్ చిత్రంలో సాక్షి అనే డిఫరెంట్ పాత్రలో అనుష్క నటిస్తోంది. అలాగే మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాత్రల లుక్స్తో పాటు ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను పెంచింది.