ఓవర్సీస్లో భారీగా వకీల్ సాబ్ ప్రీమియర్స్

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో తెలుగు సినిమాకు ఓవర్సీస్లో మునపటి కళను తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకే ఓవర్సీస్లోనే 700 స్క్రీన్లలో వకీల్ సాబ్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించాడు. కరోనా తర్వాత ఇంత భారీ ఎత్తున ఓ సినిమా విదేశాల్లో ప్రీమియర్స్ పడటం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 9న తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లో చూసినా కూడా పవన్ బొమ్మే కనిపించేలా విడుదల ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. దాదాపు 95 శాతం థియేటర్స్లో వకీల్ సాబ్ మాత్రమే కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో అన్ని రికార్డులను తుడిచిపెట్టే పనిలో పడింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్.