KGF దర్శకుడి సినిమాలో ఎన్టీఆర్ కాదు.. హీరో ఎవరంటే..

కేజీయఫ్ సినిమాతో తెలుగులో కూడా సత్తా చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియన్ సినిమా చేసి ఔరా అనిపించుకున్నాడు ఈ దర్శకుడు. యశ్ హీరోగా వచ్చిన కేజీయఫ్ గతేడాది సంచలన విజయం సాధించింది. ఒకటి రెండు కాదు.. ఓ కన్నడ సినిమా తొలిసారి 200 కోట్ల మార్క్ అందుకుని చరిత్ర సృష్టించింది. దాంతో ఈయనతో పని చేయాలని చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నిర్మాతలైతే ప్రశాంత్ నీల్కు ముందు నుంచే అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. పనిలో పనిగా ఈయన తెలుగు ఇండస్ట్రీకి కూడా వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈయన తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. అది జూనియర్ ఎన్టీఆర్ అని.. ఈయన చెప్పిన కథ ఎన్టీఆర్ కు కూడా నచ్చిందని ఇన్ని రోజులు వార్తలొచ్చాయి.
మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రశాంత్ నీల్తో తాము సినిమా చేయబోతున్న విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసారు. ఆ మధ్య ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెస్ విడుదల చేసారు మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం కేజీయఫ్ 2తో బిజీగా ఉన్న ఈ దర్శకుడు.. ఆ తర్వాత తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబుతో ఈయన సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయింది. ఫైనల్ నెరేషన్ ఇస్తే మహేష్ తో సినిమా సెట్ అయిపోయినట్లే. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్.